క్రైమ్/లీగల్

ట్రాక్టర్ బోల్తా.. యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, ఆగస్టు 10 : మండల పరిధిలోని గుర్రపుకొండ మలుపు వద్ద ట్రాక్టర్ బోల్తా పడి మారుతీ (20) అక్కడికక్కడే మృతి చెందాడు. కర్నాటక బిదరకెరెకు చెందిన మారుతీ ట్రాక్టర్‌లో కంకరను పావగడలో అన్‌లోడ్ చేసి తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా గుర్రపుకొండ మలుపు వద్ద ట్రాక్టర్ ముందు టైరు పంక్చర్ కావడంతో వాహనం అదుపు తప్పి ట్రాలీ బోల్తాపడింది. దీంతో అందులో కూర్చొన్న మారుతీ ట్రాలీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు విషయాన్ని పోలీసులకు తెలియచేయడంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.

రైతు ఆత్మహత్య
కంబదూరు, ఆగస్టు 10 : మండల పరిధిలోని రాంపురం గ్రామంలో అప్పుల బాధ తాళలేక రైతు మల్లప్ప (50) శుక్రవారం వ్యవసాయ తోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు తనకున్న ఐదెకరాల పొలంలో 9 బోర్లువేసి సుమారు రూ.2 లక్షల వరకు అప్పులు చేశాడు. ఉన్న ఒక్క బోరులో కూడా నీరు అడుగంటడంతో వేసిన పంట ఎండిపోయింది. ఈనేపథ్యంలో మానసిక ఆందోళనకు గురై అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచక ఆవేదనకు గురయ్యాడు. ఈనేపథ్యంలో తనతోపాటు ఖననం చేసేందుకు అవసరమైన సామగ్రిని తీసుకొని తొటకెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు ఎస్‌ఐ రామయ్య కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు.

నీటి సంప్‌లో పడి వ్యక్తి మృతి
మడకశిర, ఆగస్టు 10 : పట్టణ పరిధిలోని శివపురంలో నివాసం ఉంటున్న నాగరాజు (51) నీటి సంపులో పడి మృతి చెందాడు. శివపురానికి కాలనీకి చెందిన నాగరాజుకు ఎన్టీఆర్ గృహం మంజూరైంది. ఇందులో భాగంగా ఇంటి నిర్మాణం చేసుకోవడానికి అవసరమైన సంప్‌ను ఏర్పాటు చేసుకుని 15 రోజులుగా నీటిని వాడుకుంటున్నాడు. అయితే శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డాడు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో కేకలు వేసినా ఫలితం లేకుండాపోయింది. కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న కొందరు నీటి సంపులో ఉన్న నాగరాజును చూసి బయటకు తీశారు. వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.