రాష్ట్రీయం

బ్యాంక్ సొమ్ముతో పరారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు: చిత్తూరు జిల్లా ప్రొద్దుటూరులో బ్యాంక్ సొమ్ముతో ఓ ఉద్యోగి పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే..ప్రొద్దుటూరుకు చెందిన గురుమోహన్ రెడ్డి రంగసముద్రం ఎస్‌బిఐలో క్యాషయర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం పెళ్లి వేడుకలకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. సాయంత్రం అయినా రాకపోవటంతో మేనేజర్‌కు అనుమానం వచ్చి ఉన్నతాధికారులకు తెలిపారు. వారు వెంటనే వచ్చి పరిశీలించగా.. రూ.91,49,900ల క్యాష్, ఖాతాదారులు కుదవబెట్టిన బంగారం కనిపించకుండా పోయింది. క్యాషియర్‌కు, వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినా వారి ఫోన్లు స్విచ్చ్ఫా చేసి ఉండటంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.