ఆంధ్రప్రదేశ్‌

బెట్టింగ్‌లతో అప్పులపాలై యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లు వేసి అప్పుల పాలైన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పత్తికొండలో ఈ దారుణం గురువారం చోటుచేసుకుంది. సెల్‌ఫోన్ దుకాణం నడుపుతున్న మధు అనే యువకుడు క్రికెట్ మ్యాచ్‌లపై స్నేహితులతో బెట్టింగ్‌లు వేస్తూ భారీగా అప్పులు చేశాడు. బుధవారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్ సందర్భంగా మధు వేసిన బెట్టింగ్ అంచనాలు తారుమారయ్యాయి. దీంతో అప్పులు తీర్చలేనన్న మానసిక వ్యధకు లోనై తన దుకాణంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.