రాష్ట్రీయం

కాల్‌మనీ నిందితుడికి ముందస్తు బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కేసులో నాల్గవ నిందితుడుగా ఉన్న ఏపిఎస్‌పిడిసిఎల్ డివిజనల్ ఇంజనీర్ ఎం సత్యానందానికి యాంటిసిపేటరీ బెయిల్‌ను మంజూరుచేస్తూ హైదరాబాద్ కామన్ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడు లక్ష పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారి ఆదేశించినప్పుడు హాజరై విచారణకు సహకరించాలని హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఎలాంగో ఆదేశించారు. నిందితు డు సత్యానందం తరఫున పి విష్ణువర్దన్ రెడ్డి అనే న్యాయవాది వాదనలు వినిపిస్తూ నిందితుడు సత్యానందంను ఈ కేసులో ఇరికించారని, ఈ కేసు అభియోగాలతో సంబంధం లేదని తెలిపారు. పిపి వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ బెయిల్‌ను వ్యతిరేకించారు. యాంటిసేపటరీ బెయిల్ మంజూరుచేయడం వల్ల దర్యాప్తునకు విఘాతం కలుగుతుందన్నారు.