వరుణ్‌కు జతగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఏడాది మలయాళంలో విడుదలై ఘన విజయం సాధించిన ‘ప్రేమమ్’ చిత్రంలో లెక్చరర్ పాత్రలో నటించి ఆకట్టుకుంది సాయిపల్లవి. తమిళ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఈ సినిమా తర్వాత పలు తమిళ, మలయాళ చిత్రాల్లో అవకాశాలతో జోరుమీదుంది. తాజాగా ఈమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మెగా హీరో వరుణ్‌తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనుందట. ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిపారని తెలుస్తోంది. ‘అమెరికా అబ్బాయి- తెలంగాణా అమ్మాయి’ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కే ఈ సినిమాలో సాయిపల్లవి పాత్ర కొత్తగా ఉంటుందట. త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడనుంది. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంతో టాలీవుడ్‌లో ఎలాంటి ఇమేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.