కాశ్మీర్‌లో ధ్రువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘ధ్రువ’ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూళ్లను పూర్తిచేసుకుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్’ చిత్రానికి రీమేక్. మైండ్ గేమ్‌తో సాగే ఈ సినిమాలో చరణ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తారు. ఇందులో హీరోయిన్‌గా రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తోంది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో విద్యుల్లేఖ రామన్ నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ కాశ్మీర్‌లో జరగనుంది. త్వరలోనే ఈ టీమ్ కాశ్మీర్‌కు వెళ్లనుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఫొటోను మెగా అభిమానులకోసం చరణ్ ట్విట్టర్‌లో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేస్తారట.