కాశ్మీర్‌లో ధ్రువ షూటింగ్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధ్రువ’ సినిమా కొద్దిరోజులుగా కాశ్మీర్‌లో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్’కు రీమేక్ అయిన ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక కాశ్మీర్ షెడ్యూల్‌లో ఒక పాటను, కొన్ని కీలక సన్నివేశాలను పూర్తిచేసిన టీమ్, నిన్నటితో షెడ్యూల్ మొత్తాన్నీ పూర్తిచేసి తిరుగు ప్రయాణమైంది. ఈ షెడ్యూల్ చాలాబాగా వచ్చిందని రామ్‌చరణ్, నవదీప్, శశాంక్ తదితరుల నేపథ్యంలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు టీమ్ తెలిపింది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తోన్న ఆగస్టు నెలాఖరుకు పూర్తవుతుందని సమాచారం. సెప్టెంబర్ నెలాఖర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రామ్‌చరణ్ సరసన రకుల్‌ప్రీత్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో అరవింద్‌స్వామి విలన్‌గా నటిస్తున్నారు.