ఖైదీతో కాజల్ శరవేగంగా షూటింగ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అనేది ఉపశీర్షిక. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సురేఖ కొణిదల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై మెగా పవర్స్టార్ రామ్చరణ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రంలో కథానాయికగా చందమామ కాజల్ను ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో చిరంజీవి, కాజల్లపై కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా ఆన్లొకేషన్ నుంచి కాజల్ మాట్లాడుతూ, సినీ పరిశ్రమలోకి ప్రవేశించాక చిరంజీవి నటించిన సినిమాలు చాలా చూశానని, లెజెండ్ సరసన నాయికగా నటించడం అమేజింగ్గా అనిపిస్తోందని, ఇంత మంచి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా వుందని, ప్రస్తుతం షూటింగ్లో పాల్గొనడం ఎగ్జైటింగ్గా వుందని అంది. ‘ఇవాళ మొదటి రోజు షూటింగ్. మునుముందు షెడ్యూల్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం శంషాబాద్ పరిసరాల్లో నాయకానాయికల మధ్య జరిగే కొన్ని కీలక సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రత్నవేలు వంటి టాప్ సినిమాటోగ్రాఫర్ ఛాయాగ్రహణం అందిస్తున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.