మలయాళ దర్శకుడితో వెంకీ చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు వెంకటేష్ చాలాకాలం తరువాత మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘బాబు బంగారం’ చిత్రంతో మంచి విజయాన్నందుకున్నాడు. గతంలో వెంకీ నటించిన ‘దృశ్యం’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మలయాళంలో జీతు జోసెఫ్ డైరెక్షన్లో మోహన్‌లాల్ హీరోగా నటించిన సూపర్‌హిట్ సినిమా ‘దృశ్యం’ ఆధారంగానే తెలుగులోనూ రీమేక్ చేశారు. ఇప్పుడు వెంకీ ఈ టాలెంటెడ్ డైరెక్టర్‌తో కలిసి ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే జీతూ జోసెఫ్ వెంకీకి కథ చెప్పాడని, వెంకీ కూడా కథ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసుకురమ్మని జోసెఫ్‌కు చెప్పాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకొన్ని రోజుల్లోనే తెలియనున్నాయి. ప్రస్తుతం వెంకీ తమిళ సినిమా ‘ఇరుద్ది సుత్తురు’ను తెలుగులోకి రీమేక్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.