జయహో జనతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్, సమంత, నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపొందిన జనతాగ్యారేజ్ చిత్రం మంచిటాక్‌తో నడుస్తున్న సందర్భంగా హైదరాబాద్‌లో విజయోత్సవ సభను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, సమంత, కొరటాల శివ, దిల్‌రాజులతోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ, ‘కొన్ని సందర్భాల్లో ఏమీ మాట్లాడలేం. కన్నీళ్లు మాత్రమే వస్తాయి. అలాంటి అనుభూతిని కొరటాల శివ ఇచ్చారు. గత 12 ఏళ్లుగా ఇలాంటి విజయం కోసం ఎదురుచూస్తున్నాం. జనతా గ్యారేజ్ రూపంలో అది దక్కింది. చాలారోజులు నుంచి ఓ వెలుగు దూరంగా కనిపిస్తుందని చెబుతున్నా. ఆ వెలుగు ఇదే. నాకు వచ్చిన విజయాలకంటే ఈ విజయాన్ని నా గుండెకు దగ్గరగా పెట్టుకుంటాను. ఈ బాధ్యతతో మరిన్ని మంచి సినిమాలు చేస్తాను. సమంతతో ఇది నాలుగో చిత్రం. దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ,‘ఇది నాకు స్పెషల్ మూవీ. ఎన్టీఆర్ కథ వినగానే థ్రిల్ అయి ఎక్కువ ఆసక్తి చూపాడు. దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మోహన్‌లాల్ ప్రత్యేక పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్ జయహో జనతా’ అన్నారు. సమంత మాట్లాడుతూ, మంచి టీమ్ చేసిన ప్రయత్నం ఇది, ఇలాంటి బ్లాక్‌బస్టర్ విజయానికి ఎన్టీఆర్ అర్హుడని అన్నారు.