విలేజ్ సెట్‌లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ హీరోగా నటించిన ధృవ చిత్రం డిసెంబర్ 9న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అందరిలో ఆసక్తిని నెలకొల్పుతోంది. భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ సినిమా తర్వాత చరణ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తిఅయిన ఈ చిత్రాన్ని శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మితం కానుంది. సుకుమార్ మేకింగ్‌లో రూపొందే ఈ సినిమా పల్లెటూరు నేపథ్యంలో ఉంటుందట. 1980 నాటి కాలంలో జరిగే కథతో సుకుమార్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ గోదావరి జిల్లాల్లో జరపాలని అనుకున్నారట. కానీ మెగా ఫ్యాన్స్ షూటింగ్ లొకేషన్‌కు రావడం తదితర కారణాల వల్ల అంతరాయం ఉంటుందని భావించి, స్టూడియోలో అందమైన విలేజ్ సెట్‌ను రూపొందిస్తారట. తోట తరణి నేపథ్యంలో ఈ సెట్ ఉంటుందని తెలిసింది. డిసెంబర్ రెండవ వారంలో ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది.