మగధీరను మరపించే ధ్రువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ధ్రువ. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని డిసెంబర్ 9న విడుదలకు సిద్ధమైంది. కాగా డిసెంబర్ 4న చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను జరపనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- సినిమా ప్రకటించినప్పటినుండి భారీ అంచనాలతో రూపొందించామని, మగధీరకంటే పెద్ద హిట్‌గా నిలవాలని ఆశిస్తున్నామని, ప్రేక్షకులు కూడా సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారని చెప్పారు. అందరి అంచనాలను మించుతూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు, టీజర్‌కు, పాటలకు, ఇటీవల విడుదలైన థియేటర్ ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ లభించిందని, విడుదలైన 24 గంటల్లోనే రెండు మిలియన్ల వ్యూస్ సాధించిందని చెప్పారు. హైబడ్జెట్ టెక్నికల్ విలువలతో రూపొందిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, అంతకంటే ముందుగా పలువురు సినీ ప్రముఖులు, ప్రేక్షకులు అభిమానుల సమక్షంలో 4వ తేదీన యూసఫ్‌గూడా పోలీస్ లైన్‌లో ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించనున్నామని వారు తెలిపారు. 9న విడుదల కానున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించి తమ సంస్థకు మంచి చిత్రంగా నిలబెడుతుందని వారు తెలిపారు. అరవింద్‌స్వామి విలన్‌గా నటించిన ఈ చిత్రంలో నాజర్, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా:పి.ఎస్.వినోద్, సంగీతం:హిప్ హాప్ తమిళ, ఎడిటింగ్:నవీన్ నూలి, నిర్మాతలు:అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్, దర్శకత్వం:సురేందర్‌రెడ్డి.