మార్చి 24న డ్యూయెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓకె బంగారం సినిమాతో తన మ్యాజిక్ ఏంటో మరోసారి నిరూపించుకొని, సూపర్‌హిట్ కొట్టిన క్రేజీ దర్శకుడు మణిరత్నం తాజాగా మళ్లీ ఓ రొమాన్స్ డ్రామాతోనే మెప్పించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ‘కాట్రువేళదియై’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తీ, అదితి రావు హైదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను ‘డ్యూయెట్’ పేరుతో దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ మంచి అంచనాలు రేకెత్తిస్తోంది. దర్శకుడు మణిరత్నం ఈ సినిమాకు విడుదల తేదీని ఖరారు చేశారని తెలుస్తోంది. మార్చి 24న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆయన భావిస్తున్నారట. కార్తీ ఈ సినిమాలో ఓ యుద్ధ విమాన పైలట్‌గా కనిపిస్తాడు. ఓకె బంగారం’ను తెలుగులో విడుదల చేసి హిట్ కొట్టిన దిల్ రాజు ఈ సినిమాపై అదే అంచనాల్లో ఉన్నారు.