రామ్చరణ్ చిత్రం ప్రారంభం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘్ధృవ’ వంటి హిట్ మూవీ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్చరణ్ హీరోగా శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మాతలుగా కొత్త చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. చిరంజీవి క్లాప్తో ప్రారంభమైన ఈ చిత్రానికి రామ్చరణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు కొరటాల శివ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం.) మాట్లాడుతూ, ‘మా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రామ్చరణ్, సుకుమార్ కాంబినేషన్లో ఈ సినిమా చేయడం,ఈ ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రావడం చాలా ఆనందంగా ఉంది. సమంత హీరోయిన్గా నటిస్తుంది. డైరెక్టర్ సుకుమార్ డిఫరెంట్ కానె్సప్ట్తో రామ్చరణ్ను సరకొత్త లుక్లో ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సినిమాటోగ్రఫీ, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం, నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ను అందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది. సినిమాలో నటించనున్న ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’ అన్నారు.