నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్‌పై పవన్‌కల్యాణ్ ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పవన్‌కళ్యాణ్ ‘నాన్నకు ప్రేమతో’ నిర్మాత భోగవల్లి ప్రసాద్‌పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో కేసు వేయడం చర్చనీయాంశమైంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘అత్తారింటికి దారేది’ చిత్రం రూపొందింది. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఆ చిత్రం సంచలన విజయం సాధించి తెలుగులోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అప్పట్లో నిర్మాత భోగవల్లి ప్రసాద్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో పవన్ తన రెమ్యూనరేషన్‌ని తగ్గించుకున్నారు. ఆ సినిమాకు ఒప్పుకున్న రెమ్యూనరేషన్‌లో ఇంకొంత ఇవ్వాల్సి వుంది. అయితే, భోగవల్లి ప్రసాద్ తన తదుపరి చిత్రం రిలీజ్‌లోపు ఇస్తానని మాట ఇచ్చారు. కానీ అది ఆయన నిలుపుకోలేకపోవడంతో పవన్‌కళ్యాణ్ ‘మా’ను ఆశ్రయించాడు. దాంతోపాటు నిర్మాతల మండలికి కూడా ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఈ కేసుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం విడుదలకు సిద్ధమైంది.