సెప్టెంబర్ 1న పైసా వసూల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి ఆనంద్‌ప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘పైసా వసూల్’. సినిమాకు సంబంధించి విడుదల చేసిన స్టంపర్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమా అంచనాలు పెరిగాయన్న ఉత్సాహంలో బాలకృష్ణ అభిమానులు కనిపిస్తున్నారు. చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సెప్టెంబర్ 1న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. షూటింగ్, డబ్బింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది పైసావసూల్. సినిమాకు సంబంధించిన ఆడియోనూ త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ బాలకృష్ణ అభిమానులు కోరుకునే అంశాలన్నీ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని, ఫుల్ ఎనర్జిటిక్ పాత్రలో బాలయ్య నటించారని చెపుతున్నారు. యాక్షన్ సన్నివేశాలను డూప్‌లేకుండా చేశారని, వైవిధ్యమైన పాత్రలో బాలయ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు నిర్మాణ వర్గం చెబుతోంది.
ఖర్చుకు వెనుకాడకుండా చిత్రాన్ని రూపొందించినట్టు నిర్మాత చెబుతున్నారు. ‘తమ్ముడు.. నేను జంగిల్ బుక్ సినిమా చూడలే. కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలామంది చెప్పారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి’... ‘మందేసిన మదపుటేనుగునేరా! క్రష్ ఎవ్రీవన్’ లాంటి డైలాగులు అభిమానుల నోళ్లలో రిపీట్ అవుతున్నాయని, సినిమా కూడా ఇదే రేంజ్‌లో ఉంటుందని నిర్మాత ఆనంద్‌ప్రసాద్ తెలిపారు. బాలకృష్ణ ఇమేజ్‌కి తగిన విధంగా కథ, పాటలు కుదిరాయని త్వరలో ఆడియో విడుదల చేసి సెప్టెంబర్ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు యోచిస్తున్నట్టు చెప్పారు. శ్రీయ, ముస్కాన్, ఖైరాదత్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో కబీర్‌బేడీ, అలీ, పృధ్వీ, పవిత్రాలోకేష్, విక్రంజిత్ తదితరులు నటించారు. చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు.