పైసల్ వసూలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరి జగన్నాధ్‌తో ఎప్పటినుంచో సినిమా చేయాలనుకున్నా. అది లేట్ అయింది. తనలో విసుక్కోవడం లాంటి అంశాలు నేను చూడలేదు. పోర్చుగల్‌లో 36 రోజులు షెడ్యూల్ చేశాము. ఈ సినిమాను 78 రోజుల్లోనే పూర్తిచేశాం అని కథానాయకుడు బాలకృష్ణ తెలిపారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్ రూపొందించిన చిత్రం పైసా వసూల్. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సక్సెస్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మరికొన్ని విశేషాలు తెలుపుతూ సినిమా భారీ రేంజ్‌లో వుంటుందని, సెట్స్, కార్ ఛేజ్‌లు వైవిధ్యంగా వుంటాయని అన్నారు.
సెప్టెంబర్ 29న విడుదల చేయాలని అనుకున్నాం కానీ ఐదు వారాల ముందుగానే విడుదల చేస్తున్నామని తెలిపారు. తన అభిమానులు ఈ చిత్రం ఎలా వుండాలని అనుకుంటారో అలాగే వుంటుందని, అందరినీ మెప్పిస్తుందని ఆయన తెలిపారు. మామా ఏక్ పెగ్ లా పాటను పిల్లలు కూడా ఇప్పుడు పాడేస్తున్నారని, ఐదు వారాల ముందుగానే సినిమాను విడుదల చేస్తున్నామని దర్శకుడు పూరి జగన్నాధ్ అన్నారు. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి సపోర్టు చేసిన కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. కార్యక్రమంలో నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్, మోహన్‌బాబు, పులగం చిన్నానారాయణ, భాస్కరభట్ల, ఎ.కోదండరామిరెడ్డి, కథానాయికలు శ్రీయ, ముస్కాన్, కైరాదత్ తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు.