జాతీయ స్థాయిలో సినిమా హబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో అన్ని భాషల చిథ్రాలకు వీలుగా జాతీయ స్థాయి హబ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోనరావు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మండలానికి థియేటర్ వుండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రం ఎర్పడిన తొలిసారిగా పదవి అలంకరించిన ఆయన ‘తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్’ సభ్యులకు గుర్తింపు కార్డుల ప్రదాన కార్యక్రమంలో మాట్లాడారు. శుకవ్రారం ఎఫ్‌డిసి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన సభ్యులందరికీ గుర్తింపు కార్డులను ప్రదానం చేశారు. అనంతరం ఆయన జర్నలిస్టుల సంఘాన్ని అభినందిస్తూ.. ఎఫ్‌డిసి పరంగా ఏవైనా సౌకర్యాలు వుంటే తగు విధంగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యం సినిమా జర్నలిస్టులకు ప్రభుత్వపరంగా ఒకగూరే హెల్త్‌కార్డులతో పాటు ఇతర సౌకర్యాలు పొందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో చర్చించి తగిన విధంగా సహకరిస్తామన్నారు. చిత్ర పరిశ్రమలో ప్రతి ఏడాది 150 మంది కొత్త నిర్మాతలు వస్తున్నారనీ, వారి సమస్యల నూ అన్ని తెలిసిన జర్నలిస్టులు కూడా తన ముందుకు తీసుకురావచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎల్‌ఎల్‌పి పేరుతో వున్న కొంతమంది నిర్మాతలు మోనోపోలీగా మారాయనే విమర్శలు వస్తున్నాయనీ, మీడియా అందరికీ తగిన విధంగా వ్యాపార ప్రకటనలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దసరా నుంచి థియేటర్లలో ఐదు ప్రదర్శనలకు అనుమతి వస్తుందన్నారు. ఆ ఆటను చిన్న సినిమాను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయంగా పేర్కొన్నారు. ఇం తకు ముందు బాలల చిత్రాలు నిర్మించేవారికి ప్రోత్సాహం గా ఇచ్చే 15 లక్షల రూపాయల సబ్సిడీని రెం డింతలు పెం చే లా చర్యలు తీసుకోనున్నట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ప్రతి ఏటా ఇచ్చే అవార్డుకు ఇంకా పేరు నిర్ణయించలేదనీ, త్వరలో ఆ పేరును ప్రకటిస్తామన్నా రు. ఇక తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు తగినట్లు తెలంగాణ సినిమాకు ప్రత్యేక గుర్తింపు విషయంలో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందనీ త్వరలో ఆ నిర్ణయాలను ప్రకటిస్తామన్నారు. అనంతరం తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణరాజు మాట్లాడు తూ అసోసియేషన్ ఏర్పడి ఏడాదిపైగా అయిందనీ, అప్పటినుంచీ ఆపదలో వున్న జర్నలిస్టులకు, అనారో గ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అసోసియేషన్ ముందుకు వచ్చి సాయం చేసిందని గుర్తు చేశారు. మా అసోసియేషన్ ఎఫ్‌డిసి సహకారాన్ని ఆశిస్తుందని పేర్కొన్నా రు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి గోరంట్ల సత్యం, కోశాధికారి రాధాకృష్ణ, రమేష్, రాంబాబు, పి.ఎస్.ఎన్ రెడ్డి, అశోక్, మురళీ, సుజన్, శ్రీపాల్, విజయానంద్ పాల్గొన్నారు.