జిందగీ విజయోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్, అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణ చైతన్య నిర్మించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు కిశోర్ తిరుమల మాట్లాడుతూ సినిమా అందరికీ నచ్చింది. చాలా మంది సన్నివేశాల గురించి మాట్లాడుతుంటే ఎంతో ఆనందంగా వుంది. ముఖ్యంగా ప్రేమను వ్యక్తం చేసే సన్నివేశం కోసం నాలుగు రోజులు సమయం పట్టింది. అలాగే ఎమోషనల్ డైలాగ్స్‌కు కూడా మంచి స్పందన లభిస్తోంది. అభి పాత్రలో రామ్ అద్భుతంగా నటించాడు. ఈ చిత్రాన్ని ఇంత బాగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు. హీరో రామ్ మాట్లాడుతూ యూత్ బెస్ట్ మూవీ అవుతుందని అనుకున్నాం కానీ, యూత్‌తోపాటు ఫ్యామిలీ కూడా కనెక్ట్ అయింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరైన సినిమా ఇది. ముఖ్యంగా డైలాగ్స్‌కు బాగా పేరు వచ్చింది. అందరికీ గుర్తుండిపోయే పాత్రల్లో నటించడం ఆనందంగా వుందన్నారు. ఈ చిత్రంలో వాసు పాత్రను పోషించిన శ్రీవిష్ణు మాట్లాడుతూ చాలా మంచి సినిమా. ఈ సక్సెస్‌తో మరిన్ని కొత్త కొత్త కానె్సప్ట్‌లు తెరపైకి వస్తాయి. ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్‌లో ఏడ్చిన సందర్భాలున్నాయి అన్నారు. లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ అద్భుతమైన సినిమా చేసినందుకు చాలా ఆనందంగా వుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమణి, కిరీటి, కృష్ణ చైతన్య, అనుపమా పరమేశ్వరన్, చంద్రబోస్, ప్రియదర్శి, స్రవంతి రవికిశోర్ పాల్గొన్నారు.