జై సింహా’ షెడ్యూల్ పూర్తి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ సి.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘జై సింహా’. బాలకృష్ణ సరసన నయనతార, నటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం వైజాగ్లో భారీ షెడ్యూల్ పూర్తిచేసుకొని త్వరలో మరో షెడ్యూల్లోకి సన్నద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ- వైజాగ్ బీచ్ రోడ్లో 5వేలమంది జూనియర్ ఆర్టిస్టులు, 110 బస్సులతో మహాధర్నా సీక్వెన్స్, బాలకృష్ణ-హరిప్రియలపై ఓ రొమాంటిక్ సాంగ్తోపాటు, బాలయ్య-నయనతారపై ఓ మాంటేజ్ సాంగ్ ను షూట్ చేశాం. ఔట్పుట్ చాలా అద్భుతంగా వచ్చిం ది. అలాగే ఇటీవల విడుదలచేసిన బాలయ్య ఫస్ట్లుక్ పోస్టర్కు, టైటిల్కు విశేషమైన స్పందన లభిస్తోంది. ఇప్పటివరకూ బాలయ్య కెరీర్లో ‘సింహ’ అనే టైటిల్తో వచ్చిన సినిమాలన్నీ సూపర్హిట్ అయినట్లుగా ‘జై సింహా’ కూడా హిట్ అవ్వడం ఖాయం అన్నారు. బాలకృష్ణ, నటాషా దోషీ, ప్రకాష్రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జయప్రకాష్రెడ్డి, ప్రభాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్: అరివుమణి-అంబుమణి, కెమెరా: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్భట్, నిర్మాణం: సి.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లి., దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్.