24న మెంటల్ మదిలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీవిష్ణు, నివేద పెతురాజ్ జం టగా ధర్మపధ క్రియేషన్స్ పతాకంపై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రాజ్ కందుకూరి రూపొందించిన చిత్రం ‘మెంటల్ మదిలో...’. ఈ చిత్రానికి సంబంధించిన పాత్రికేయుల సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. నాలుగో పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఈ చిత్రంలో అయోమయంలో ఉన్న ఓ అబ్బా యి కథనాన్ని ప్రధానంగా చర్చించామని, ఈ నెల 20న సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించి 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. దాదాపు ఏడాదికాలం ఈ చిత్రం కోసం పనిచేసామని, మూడు పాటలు ఇప్పటికే విడుదలై మంచి ఆదరణ పొందాయని దర్శకుడు వివేక్ ఆత్రేయ తెలిపారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు ప్రశాంత్, నివేద పెతురాజ్, కిరీటి దామరాజ్, మధుర శ్రీ్ధర్, శ్రీవిష్ణు తదితరులు పాల్గొని విశేషాలు తెలిపారు.