‘సామి’ సీక్వెల్‌కు నో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంలో హీరో విక్రమ్ నటించిన ‘సామి’ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. దాన్ని తెలుగులో బాలకృష్ణ హీరోగా ‘లక్ష్మీ నరసింహ’ పేరుతో రీమేక్ చేశాడు. చాలా రోజుల తరువాత ఇప్పుడు ‘సామి’కి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. సామి మొదటి భాగంలో హీరోయిన్‌గా నటించిన త్రిషనే మళ్లీ హీరోయిన్‌గా పెట్టాలని ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రపోజల్‌కు త్రిష కూడా ఓకె చెప్పింది. దానికితోడు.. ఆమెకు రెమ్యూనరేషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావడంతో త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా చేయనని త్రిష చెప్పడంతో యూనిట్ షాక్ అయ్యింది. ప్రస్తుత పలు సినిమాలతో బిజీగా ఉన్న త్రిష ఇప్పుడు ఈ సినిమా నుండి తప్పించుకోవడంతో నిర్మాతలు మండలిలో ఫిర్యాదు చేశారు. త్రిషతోపాటు కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుందట. కీర్తి సురేష్‌కే ఎక్కువ ప్రాధాన్యత వుండడంతో త్రిష తప్పకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో నటించడం లేదని.. తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇస్తానని కూడా చెప్పింది.