9న వస్తున్న ‘ఏ మంత్రం వేశావే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి చిత్రాలతో యువతలో కథానాయకుడు విజయ్ దేవరకొండ సంపాదించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అర్జున్‌రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ యువతలో మోస్ట్ క్రేజియస్ట్ హీరోగా మారాడు. ఇక ఈ యువ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘ఏ మంత్రం వేశావే’. విజయ్ సరసన శివానీసింగ్ నాయికగా నటిస్తోంది. గోలీసోడా ఫిలిమ్స్ నిర్మాణంలో సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇం. ప్రై. లి. మల్కాపురం శివకుమార్ సమర్పణలో శ్రీ్ధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని మార్చి 9న ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సమర్పకుడు మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ- గేమ్ నేపథ్యంలో నడిచే భిన్నమైన కథ ఇది. విజయ్ దేవరకొండ పాత్ర ఇందులో చాలా వైవిధ్యంగా, నేటి యువతరానికి ప్రతినిధిగా కనిపించబోతున్నాడు. పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి తరహాలోనే ఈ చిత్రం కూడా ఆయన కెరీర్‌లో మరపురాని చిత్రంగా ఉండబోతోంది. విదేశాల్లో చిత్రీకరించిన సన్నివేవాలు చిత్రానికి హైలెట్‌గా వుంటాయి. మార్చి 9న చిత్రాన్ని విడుదల చేస్తాం అని తెలిపారు. శివన్నారాయణ, రాజబాబు, నీలాక్షిసింగ్, ఆశీష్‌రాజ్, ప్రభావతి, దీపక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అబ్బత్ సమత్, సినిమాటగ్రఫీ: శివారెడ్డి.