9న ఏ మంత్రం వేసావె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోలిసోడా ఫిల్మ్ పతాకంపై సుర ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత మల్కాపురం శివకుమార్ సమర్పణలో అర్జున్‌రెడ్డితో యూత్‌ఫుల్ స్టార్‌గా మారిన విజయ్ దేవరకొండ హీరోగా, శివానీ సింగ్ నాయికగా శ్రీ్ధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఏ మంత్రం వేసావె. ఈ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ కంప్యూటర్, సోషల్ మీడియాకు బానిసలు కావడం వల్ల నేటి యువత ఒంటరివాళ్లుగా మిగిలిపోతున్నారు. సమాజంలో సంబంధాల్ని తెంచుకుంటున్నారు. ఈ ధోరణి చాలా ప్రమాదకరం. ఇదే అంశాన్ని సినిమాలో చూపించాం. కంప్యూటర్ గేమింగ్ సర్వస్వంగా బ్రతుకుతున్న ఓ యువకుడికి ఆన్‌లైన్‌లో ఓ అమ్మాయి పరిచయమవుతుంది ఒక మాయా ప్రపంచంలో జీవిస్తున్న అతనికి మానవీయ విలువలు ఏమిటో పరిచయం చేస్తుంది. ప్రేమతో అతని జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. ఈక్రమంలో చోటు చేసుకునే ఆసక్తికరమైన సంఘటనలు ఏమిటన్నదే మా చిత్ర కథ. రొమాంటిక్ థ్రిల్లర్‌గా అందరినీ ఆలోచింప చేస్తుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్ యు సర్ట్ఫికెట్ లభించింది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిదని సెన్సార్ వారు ప్రశంసించారు. ఇందులో విజయ్ దేవరకొండ పాత్ర చిత్రణ భిన్న పార్శ్వాల్లో సాగుతుంది. అర్జున్‌రెడ్డి తరహాలోనే నవ్యతతో ఆకట్టుకుంటుంది అన్నారు. పెళ్లిచూపులు అర్జున్‌రెడ్డి చిత్రాలతో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల్లో తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఏ మంత్రం వేసావె అందరి అంచనాల్ని అందుకునేలా ఉంటుంది. చిత్ర ట్రైలర్‌ను యూ ట్యూబ్‌లో 20 లక్షల మందికి పైగా వీక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వెయ్యి థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం అని సమర్పకుడు మల్కాపురం శివకుమార్ చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రపీ: శివారెడ్డి, మాటలు: అంజలి పార్వతి, శ్రీ్ధర్ మర్రి, శ్రీకాంత్‌నాయుడు, అరుణ్ వేమూరి, సంగీతం: అబ్దుస్ సమద్, ఆర్ట్: భూపేష్, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: శ్రీ్ధర్ మర్రి.