ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్ర పరిశ్రమలో బంద్ అనేది బ్రహ్మాస్త్రం లాంటిది. దానిని ఉపయోగించి తెలుగు ఫిలించాంబర్ ఏం సాధించిందో అర్థం కావడంలేదన్నారు నారాయణమూర్తి. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ రేట్లు తగ్గించాలంటూ సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఒక తాటిమీదకొచ్చి మార్చి 2నుంచి థియేటర్లు బంద్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌వారు తెలుగు ఫిలించాంబర్ సుదీర్ఘ చర్చలు అనంతరం ఈ శుక్రవారం నుంచి థియేటర్ల బంద్‌ని విరమింపజేసారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నటుడు, నిర్మాత, దర్శకుడు నారాయణమూర్తి స్పందించి మాట్లాడుతూ- తమిళం, మలయాళం, కన్నడ భాషల చిత్ర పరిశ్రమల్లో ఇంకా థియేటర్ల బంద్ కొనసాగుతుంటే మన తెలుగు ఫిలిం చాంబర్ అప్పుడే బంద్‌ను ఎందుకు ఆపాల్సి వచ్చింది. ఐదేళ్ల తర్వాత ఫ్రీగా ఇస్తామంటూ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇచ్చిన హామీలు అమలు కాకముందే ఎందుకు హఠాత్తుగా బంద్ విరమించుకున్నారు, ఈ బంద్‌వల్ల సినీ కార్మికులు ఇబ్బంది పడ్డారు తప్ప ఒరిగిందేమీ లేదు. అయినా నిర్మాతలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అందరూ సహకరించారు. అలాగే పబ్లిక్ కూడా బంద్‌కు ఎంతో సహకరించారు, చిత్ర పరిశ్రమకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మేమంతా సంఘీభావం తెలిపాం. కానీ ఇలా మీ ప్రయోజనాలు, స్వార్థం కోసం బంద్‌ని హఠాత్తుగా ఆపేస్తారా? ఈ బంద్‌వల్ల సాధించింది ఏమిటి? దీనికోసమైతే సురేష్‌బాబు, జెమిని కిరణ్, అల్లుఅరవింద్ లాంటి పెద్దలు బంద్‌వరకు వెళ్లకుండా ముందే మాట్లాడి సెటిల్ చేస్తే సరిపోయేది కదా? గతంలో రామానాయుడు, దాసరి నారాయణ వంటి పెద్దలు పదిమంది నిర్మాతల మంచి కోరేవారు తప్ప ఎప్పుడూ తామే బతకాలనీ, తమ స్వార్థం కోసం ఆలోచించలేదు. గతంలో కూడా లీజులు, డిజిటల్ సర్వీసు ప్రొవైడర్స్ మీద మేము ఎన్నో పోరాటాలు, నిరాహారదీక్షలు చేసాం కానీ ఐక్యత లేకపోవడంవలన సెక్సెస్ సాధించలేకపోయాం. దీనికి కారణం మేజర్ సెక్టర్‌వాళ్ల సపోర్టు లేకపోవడంవల్లే. కొద్దిమంది ప్రయోజనాలు చూసుకోవడం వలన. ఇకనైనా తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు ఈ విషయంలో కలుగజేసుకుని చిన్న చిత్రాల నిర్మాతలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. రెండు వేలు, రెండువేల ఐదువందలకు మేం డిజిటల్ సర్వీస్‌లు ప్రొవైడ్ చేస్తామని నూతన కంపెనీలు వస్తున్నా వారిని ఎందుకు రానీయడంలేదు. కొత్తవారికి అవకాశమిస్తే ఖచ్చితంగా క్యూబ్, యుఎఫ్‌ఓ వాళ్లు దిగిరాక మానరు. ఈవిషయంలో ఇకనైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రతి ఒక్కరికీ మంచి జరిగేలా చూడాలని కోరుతున్నా అన్నారు నారాయణమూర్తి. ప్రతాని రామకృష్ణ మాట్లాడుతూ, పదేళ్లుగా డిజిటల్ వ్యవస్థమీద పోరాడుతున్నాం. పెద్దల సపోర్టు లేక మేము సక్సెస్ కాలేకపోయాం. ఫ్రీగా ఇచ్చే థియేటర్స్ బంద్ ఆపబోమని చెప్పి ఇలా రెండువేల రూపాయలు తగ్గించగానే థియేటర్స్ బంద్ ఆపేసారు. ఇదికాదు మేము కోరుకునేది. మొత్తం ఫ్రీగా ఇవ్వాలి లేదా మీరు తప్పుకుంటే మేము వేరే కంపెనీలతో ముందుకెళ్తాం. ఇలా ఇద్దరు ముగ్గురు ప్రయోజనాల కోసం బంద్ విరమించుకోవడం కరెక్టు కాదు. దీనిపై ఒకసారి పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని అందరికీ మంచి జరిగేలా చూడాలని కోరుకుంటున్నా. ఇప్పటికే చాలా కంపెనీలు తక్కువ రేటుకే ప్రొవైడ్ చేస్తామని ముందుకొస్తున్నాయి. వారిని ఎంకరేజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా అన్నారు.