సుబ్రహ్మణ్యపురంలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల ‘మళ్ళీ రావా’వంటి ఓ వైవిధ్యమైన చిత్రంతో విజయాన్ని అందుకున్న ప్రామిసింగ్ హీరో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సుబ్రహ్మణ్యపురం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. టారస్ సినీ కార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈషా కథానాయికగా నటిస్తున్నది. హీరోహీరోయిన్లు సుమంత్, ఈషాపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నాగచైతన్య క్లాప్‌నివ్వగా, దర్శకుడు ప్రశాంత్‌వర్మ కెమెరా స్విచాన్ చేశారు. తొలి సన్నివేశానికి దర్శకుడు చందూ మొండేటి గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర లోగోను ఏపీ ఎంపీ జె.సి.దివాకర్‌రెడ్డి, కథానాయకుడు రాజశేఖర్, జీవిత సంయుక్తంగా ఆవిష్కరించారు.అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో సుమంత్ మాట్లాడుతూ సాధారణంగా నా సినిమా ప్రారంభోత్సవ వేడుకలకు హడావిడి చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇది నా 25వ సినిమా అని అందుకే సందడిగా ప్రారంభిస్తున్నామని నిర్మాతలు రెండువారాల క్రితం చెప్పారు. వారు గుర్తుచేసేవరకు నాకు 25వ సినిమా అని తెలియదు. దర్శకుడు సంతోష్ రెండున్నర గంటలపాటు కథ వినిపించారు. అందులోనే సినిమా మొత్తం చూపించారు. సూపర్ నాచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టర్ థ్రిల్లర్ ఇది అన్నారు.