మాస్ రాజా సరసన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం నేల టిక్కెట్టు సినిమాతో ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయిన రవితేజ, ఈ సినిమా తరువాత వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే శ్రీను వైట్లతో అమర్ అక్బర్ ఆంటోనీ, తేరి రీమేక్‌లు చేస్తున్న ఆయన ఈనెల చివరి నుండి అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్లనున్నారు. దాదాపు రెండు నెలలపాటు అక్కడే ఉంటాడట. ఈ సినిమాలో హీరోయిన్ అను ఇమ్మానుయేల్ తప్పుకోవడంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ని దింపడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే గోవా భామ ఇలియానాతో చర్చలు జరుగుతున్నాయి. ఇలియానా కూడా టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని అందులో మరో హీరోయిన్‌గా శృతిహాసన్‌ని ఎంపిక చేశారు. తాజాగా జరిగిన చర్చలతో శృతిహాసన్ కూడా ఓకే చెప్పిందట. ఇక మరో హీరోయిన్‌ని ఎంపిక చేయాల్సి ఉంది. శృతిహాసన్ ఇదివరకే బలుపులో నటించింది. వీరిద్దరి పెయిర్‌కు మంచి క్రేజ్ రావడంతో మరోసారి ఈ జోడీని రిపీట్ చేయనున్నారు. ప్రస్తుతం శృతిహాసన్ కేవలం ఒకే ఒక బాలీవుడ్ సినిమాలో నటిస్తుండటం మళ్ళీ తెలుగులోకి చాలా గ్యాప్ తరువాత రీఎంట్రీ ఇస్తుంది.