మగాడికీ మీ టూ.. ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మీ టూ’ ఉద్యమం దేశాన్ని ఊపేస్తోంది. ఈ ఉద్యమ స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు లైంగిక వేధింపులపై గొంతు విప్పుతున్నారు. ఇక్కడ టెమ్ట్ రవి కూడా ‘మీ టూ’ అంటూ ముందుకొస్తున్నాడు. ‘ఏడు చేపల కథ’ చిత్రంలో టెమ్ట్ రవి వైవిధ్యమైన పాత్రతో మెప్పించబోతున్నాడు. అడల్ట్ కామెడీ జోనర్‌లో పూర్తిగా కొత్తవారితో నిర్మిస్తోన్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అభిషేక్‌రెడ్డి, బిగ్‌బాస్ ఫేం భానుశ్రీ, ఆయేషాసింగ్, నగరం సునీల్ తదితరులు నటిస్తున్న చిత్రాన్ని చరిత సినిమా ఆర్ట్స్ పతాకంపై రాకేష్‌రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్‌రెడ్డి, జివిఎన్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ఆడవాళ్లమీద మగవారు చేసిన అఘాయిత్యాలు ఆధారాలు లేకపోయినా, ఆరేళ్ల తర్వాత అయినా మనం నమ్ముతున్నాం. కానీ మగాళ్ల మీద ఆడవారు చేసే అఘాయిత్యాలను ఆధారాలతో అరిచి గీపెట్టినా ఎవ్వరూ నమ్మరు. అందుకే మగవారి తరఫున మీ టూ అంటూ టెమ్ట్ రవి ప్రయోగాత్మక పాత్ర ‘ఏడు చేపల కథ’లో చేస్తున్నాడు. అడల్ట్ కామెడీ జోనర్‌లో రూపొందించిన చిత్రాన్ని పూర్తిగా కొత్తవారితో నిర్మిస్తున్నాం. చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పటివరకు ఈ తరహా ఫస్ట్‌లుక్ పోస్టర్ రాలేదనే ప్రశంసలు దక్కుతున్నాయి. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్ని పోలిన విధంగా చిత్రం ఫస్ట్‌లుక్ ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దర్శకుడు శామ్‌జే చైతన్య విభిన్నమైన కానె్సప్ట్‌ను రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా మలిచాడు. ఆద్యంతం ఆసక్తి కలిగించే సన్నివేశాలతో ఏడు చేపల కథ నడుస్తుంది. అభిషేక్‌రెడ్డికి ఈ సినిమా మంచి పేరు తేనుంది. తన పెర్ఫార్మెన్స్‌తో ఇంప్రెస్ చేయనున్నాడు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన సెనే్సషనల్ టీజర్‌ను చేయబోతున్నాం అన్నారు.