సూపర్ నేచురల్ కథతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళంలో వైవిధ్యమైన కథలతో హీరోగా తనకంటూ ఇమేజ్ తెచ్చుకున్న సందీప్‌కిషన్ ఇపుడు నిర్మాతగా మారాడు. నెక్స్ట్ ఏంటి? అన్న ఆలోచనలో -సొంత బ్యానర్‌పై ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నాడు. అనన్య సింగ్‌తో ‘నిను వీడని నీడను నేనే’ అంటూ కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు సందీప్. వెంకటాద్రి టాకీస్‌పై ద్విభాషా చిత్రంగా రాబోతున్న చిత్రానికి దర్శకుడు కార్తిక్‌రాజు. సినిమాకు సంబంధించి సందీప్ తొలి లుక్ ఇది. సందీప్ కిషన్, దయా పనె్నం సంయుక్తంగా స్థాపించిన నిర్మాణ సంస్థ వెంకటాద్రి టాకీస్. ఈ బ్యానర్‌పై అనన్యసింగ్ హీరోయిన్‌గా నిర్మిస్తున్న తొలి చిత్రం ‘నిను వీడని నీడను నేనే’కు కార్తీక్‌రాజు దర్శకుడు. చిత్రానికి సంబంధించి కార్తీకపౌర్ణమి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దర్శకుడు కార్తీక్‌రాజు మాట్లాడుతూ- సూపర్ నేచురల్ కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామన్నాడు. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని డిఫరెంట్ పాయింట్‌ను హైటెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిస్తున్నామని, వైవిధ్యమైన సినిమాలు చేసే సందీప్ నటిస్తున్న తొలి సూపర్ నేచురల్ స్టోరీ ఇదన్నాడు. సందీప్ కిషన్‌ను మరో కొత్త పాత్రలో చూస్తారని, అన్ని వర్గాల ప్రేక్షకులు ఆకట్టుకునేలా చిత్రం ఉంటుందని, త్వరలోనే ట్రైలర్, పాటల విడుదల తేదీని ప్రకటిస్తామన్నాడు. నిర్మాత దయా పనె్నం మాట్లాడుతూ దర్శకుడు కార్తీక్ చెప్పిన కథ బాగుంది. సూపర్ నాచురల్ నేపథ్యంలో సాగే చిత్రమిది. మరో ఆరు రోజుల షూటింగ్‌తో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. రషెస్ చూసి గూఢచారి వంటి హిట్ చిత్రాన్ని విడుదలచేసిన విస్తా మర్చెంట్స్ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సినిమాను విడుదల చేయడానికి ముందుకొచ్చారు. అందుకు కృతజ్ఞతలన్నారు. సందీప్ కిషన్ స్నేహితుడు శివా చెర్రీ, మేనేజర్ సీతారామ్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలావుంటే, తమన్నా బాటియా హీరోయిన్‌గా సందీప్ కొత్త చిత్రం నెక్స్ట్ ఏంటి? డిసెంబర్‌లో విడుదల కానుండటం తెలిసిందే.