మళ్లీ గీతా ఆర్ట్స్‌లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గీత గోవిందం’తో తిరుగులేని విజయాన్ని అందుకొని స్టార్ డైరెక్టర్‌గా మారిపోయారు పరశురాం. గీతాఆర్ట్స్ 2 పతాకంపై నిర్మితమైన ఈ చిత్రం విడుదలై 4 నెలలు కావస్తున్నా ఇంతవరకు తన నెక్స్ట్ సినిమాను ప్రకటించలేదు ఈ డైరెక్టర్. అయితే పరుశురాం రెండు పెద్ద బ్యానర్లలో సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో ఒకటి గీతాఆర్ట్స్ కాగా మరొకటి మైత్రీ మూవీమేకర్స్. అయితే వీటిలో ముందుగా గీతాఆర్ట్స్‌లోనే సినిమాచేసే అవకాశాలు వున్నాయని సమాచారం. ప్రస్తుతం పరుశురాం రెండు స్క్రిప్ట్‌లతో రెడీగా వున్నాడట. త్వరలోనే తన కొత్త చిత్రాన్ని ప్రకటించనున్నాడు. ఇక అన్ని కుదిరితే ఈ దర్శకుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కూడా సినిమాచేసే అవకాశాలు వున్నాయట. పరుశురాం ఎప్పటినుండో బన్నీతో సినిమా చేయాలనీ అనుకుంటున్నాడు.