మే 11న కీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో జీవా కథానాయకుడిగా సైబర్ క్రైమ్ నేపథ్యంలో రూపొందుతున్న సైలకాజికల్ థ్రిల్లర్ -కీ. నిక్కీ గల్రానీ, అనైక సోథి హీరోయిన్లు. రాజేంద్రప్రసాద్, సుహాసిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో కలీస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కృష్ణ క్రియేషన్స్, లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్ పతాకాలపై ఈ సినిమా తెలుగులో, మే 11నే తమిళంలోనూ సినిమా విడుదలవుతోంది. ‘టెక్నాలజీ విస్తృతమవుతున్న ఈరోజుల్లో ఉపయోగమెంతో, నష్టమూ అంతే ఉంటుంది. కంప్యూటర్‌ను హ్యాక్ చేసి చేస్తున్న బెదిరింపులు ఒక్కోసారి ప్రాణాలు తీస్తున్నాయి. అలాగే బ్లూవేల్ గేమ్ ఎంతమంది ప్రాణాలు తీసిందో చెప్పాల్సిన పని లేదు. అంతకంటే ప్రమాదకరమైన గేమ్‌ను మనం ఇప్పటికే ఆడుతున్నాం. అదేంటో తెలుసుకోవాలంటే మే 11 వరకూ ఆగాలి’ అంటున్నారు దర్శక, నిర్మాతలు.