రాష్ట్రీయం

ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ఖరారుకు కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరజ్‌కుంద్ క్రాఫ్ట్ మేళాపై జీవో
హైదరాబాద్, జనవరి 2: హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఫిబ్రవరి 1 నుంచి 15వరకు జరిగే 30వ సూరజ్‌కుంద్ క్రాఫ్ట్‌మేళాలో తెలంగాణ పర్యాటక శాఖ థీమ్ స్టేట్‌గా పాల్గొంటోందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం ఈవెంట్ మేనేజ్‌మెంట్ నిర్వహణకు ఏజెన్సీని ఖరారు చేసేందుకు ఒక కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ కమిటీకి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి చైర్మన్‌గా, యువజన, పర్యాటక శాఖ అదనపు కార్యదర్శి సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా టూరిజం శాఖ కార్యదర్శి, టూరిజం శాఖ కమిషనర్, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండి, సాంస్కృతిక వ్యవహారాల శాఖ డైరక్టర్, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్, సూరజ్‌కుంద్ మేళా అథారిటీలోని ఒకరు, న్యూఢిల్లీకి చెందిన పిహెచ్‌డి చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీలను ప్రభుత్వం కమిటీలో నియమించింది.