క్రైమ్/లీగల్
సమత కేసులో సాక్షుల విచారణ పూర్తి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 8 January 2020
ఆదిలాబాద్, జనవరి 7: సామూహిక అత్యాచారం, హత్యకు గురైన సమత కేసులో సాక్షుల విచారణ పూర్తికావడంతో ఫాస్ట్ట్రాక్ కోర్టులో వాదనలు బుధవారం నుండి కొనసాగనున్నాయి. సమత తరపున 44 మంది సాక్షులను చార్జిషిట్లో ప్రవేశపెట్టగా వీరిలో న్యాయస్థానం 28 మందిని విచారించి వాంగ్మూలాలను స్వీకరించింది. ఆ తదుపరి నిందితుల తరఫున సాక్షులను విచారించాలని న్యాయవాది కోర్టును ఆశ్రయించగా సోమ, మంగళవారాల్లో రెండు రోజులు న్యాయమూర్తి గడవు ఇచ్చినప్పటికీ నిందితుల తరపున సాక్షులెవరూ హాజరుకాకపోవడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. నిందితుల తరఫున న్యాయవాది, సమత తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ బుధవారం నుండి వాదనలు వినిపించే అవకాశం ఉంది.