క్రైమ్/లీగల్
రెండు బైకులు ఢీ..ఇద్దరి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తలకొండపల్లి, జనవరి 30: రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి పోలీస్ స్టేషన్కు చెందిన జంగారెడ్డిపల్లి గ్రామ సమీపంలో గురువారం ఎదురు ఎదురుగా రెండు బైకులు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన చోటు చేసుకొవడంతో రెండు గ్రామాలైన జంగారెడ్డిపల్లి, రాంపూర్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన దాసరి గుమ్మడయ్య, మల్లేష్ అనే ఇద్దరు వ్యక్తులు స్ప్రెండ్లర్ ప్లెస్ బైకు పై ఆమనగల్లు వెళుతుండగా, శెట్టిపల్లి నుంచి రాంపూర్ గ్రామానికి హోండా షేన్ బైక్పై ముగ్గురు యువకులు మహేష్, శివ, రాములు అతివేగంతో వచ్చి ఢీ కొట్టడంతో, బైక్ నడుపుతున్న గుమ్మడయ్య (38) అక్కడిక్కడే మృతి చెందగా, మీసాల మహేష్ (19) అనే యువకుడును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని తెలిపారు. ముగ్గురు యువకులకు గాయాలు కావడంతో శివ అనే యువకుని పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి కొత్తూర్ ఇన్చార్జీ సీఐ చంద్రబాబు, షాద్నగర్ ట్రాఫిక్ ఎస్ఐ రఘు, తలకొండపల్లి ఎస్ఐ సురేష్ యాదవ్, ప్రమాదం స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు.