క్రైమ్/లీగల్
ఇద్దరిని ఢీకొట్టిన కారు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 5 February 2020
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 4: మద్యం మత్తులో ఇద్దరిని ఓ కారు డ్రైవర్ ఢీకొట్టాడు. ఈ ఘటనలో తల్లికూతుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. కారులో అబ్దుల్ వాజీద్ జీషన్(27) అనే వ్యక్తి మద్య సేవించి కారు నడిపాడని తెలిపారు. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 199 వద్దకు రాగానే ఎక్స్ప్రెస్ వే, ఫుట్పాత్పై వెళ్తున్న పాదచారులను ఢీకొట్టాడు. ఈ ఘటనలో తబస్సం బేగం(42), ఆమె కుమార్తె సరుూదా మదీహా మేనాజ్(21) గాయపడ్డారు. నిందితుడు ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ సేవించి ఉన్నాడని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.