క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయిని దుర్మరణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 5 February 2020
నందిగామ, ఫిబ్రవరి 4: జాతీయ రహదారిపై నందిగామ రైతుపేటలో మంగళవారం ఉదయం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మానస అనే ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయిని మృతి చెందారు. నందిగామ రైతుపేటలో ఉంటున్న ఆమె కంచికచర్లలోని ఒక కార్పోరేట్ పాఠశాలలో పని చేస్తోంది. మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనంపై పాఠశాలకు వెళుతూ లారీని ఢీకొట్టి టైరు కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.