క్రైమ్/లీగల్

ఐటీడీఏ డిప్యూటీ ఈఈ ఇంటిపై ఏసీబీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర: పార్వతీపురం ఐటీడీఏ డిప్యూటీ ఈఈ తూతిక మోహన్‌రావు ఇంటిపై శ్రీకాకుళం, పార్వతీపురంలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పెద్ద మొత్తంలో బంగారం, వెండి వస్తువులు, సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ కోట్లలో ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటిలోనే కాకుండా శ్రీకాకుళంలోని మోహన్‌రావు ఇంటితో పాటు బంధువుల ఇళ్లల్లో మంగళవారం ఉదయం నుంచి శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఏసీబీ అధికారులు బృందాలుగా విడిపోయి నాలుగు చోట్ల దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. దాడుల్లో పెద్ద మొత్తంలో నగదును గుర్తించారు. బంగారు ఆభరణాలు, వెండి సామగ్రి, ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.