క్రైమ్/లీగల్

డెలివరీ బాయ్‌పై హత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఫిబ్రవరి 10: ఫుడ్ ఆర్డర్ ఇచ్చి వచ్చిన డెలివరీ బాయిపై దాడి చేసి నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జీడిమెట్ల పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బాలానగర్ ఏసీపీ పురుషోత్తం, జగద్గిరిగుట్ట సీఐ గంగారెడ్డిలు నిందితుల వివరాలను వెల్లఢించారు. జూబ్లీహిల్స్‌లో నివాసముండే మనిదీప్, వినయ్, వీరేష్‌లతో కలిసి ఆన్‌లైన్‌లో ఫుడ్‌ని ఆర్డర్ చేస్తారు. డెలీవరీ చేసే బాయిల పై దాడి చేసి వారి నుంచి విలువైన సొత్తును అపహరించుకుని పరారవుతారు. ఈ క్రమంలో ఈ నెల 3న రాత్రి 10 గంటల సమయంలో మనిదీప్, వినయ్, వీరేష్‌లు స్విగ్గీకి ఫుడ్‌ని ఆర్డర్ చేశారు. ఫుడ్‌ని తీసుకుని వచ్చిన బాయిని రావినారాయణ రెడ్డి నగర్ ఫారెస్ట్ నిర్జీవ ప్రాంతానికి రమ్మని చెప్పారు. ఫుడ్‌తో అక్కడికి చేరుకున్న డెలివరీ బాయి పై దాడి చేసి మనిదీప్, వీరేష్, వినయ్ కలిసి దాడి చేసి సెల్‌ఫోన్‌ని, విలువైన వస్తువులను లాక్కుని దోపిడీ చేసి ఆపై బీరు బాటిలో తలపై బాది హత్యాయత్నం చేశారు. కాల్ డేటా ఆధారంగా జగద్గిరిగుట్ట పోలీసులు కేసునమోదు చేసుకుని నిందితుడు మనిదీప్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.