క్రైమ్/లీగల్

భజన్‌పురాలో ఘోరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న భజన్‌పురాలో ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు మృత దేహాలను పోలీసులు కనుగొన్నారు. మృతదేహాలు కుళ్ళిపోయిన స్థితిలో ఉండగా, పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ-రిక్షా డ్రైవర్ శంభు చౌదరి ఇంట్లో నుంచి దుర్వాసన రావడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఆ ఇంటి తలుపులు బద్ధలుగొట్టి లోపలికి ప్రవేశించి, శంభు చౌదరి (43), ఆయన భార్య సునీత (37), పిల్లలు శివం (17), సచిన్ (14), కోమల్ (12)ల మృతదేహాలను కనుగొన్నారు. వీరి మృతికి కారణాలు తెలియరాలేదు. ఫొరెన్సిక్ బృందాలు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలను సేకరించారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత కారణాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగానే వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గత ఐదు నెలలుగా ఈ కుటుంబం ఇక్కడ అద్దెకు ఉంటున్నారు. వీరిది బిహార్‌లోని సూపోల్ జిల్లాగా గుర్తించారు.

*చిత్రం... న్యూఢిల్లీలోని భజన్‌పురాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలను కనుగొన్న ప్రాంతాన్ని
పరిశీలిస్తున్న పోలీసులు