క్రైమ్/లీగల్

పెన్నాలో మునిగి నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్ధవటం: పెన్నానది నీటిలో మునిగి నలుగురు మృత్యువాతపడ్డారు. నీటి లో ఆడుకుంటూ మునిగిపోతున్న ముగ్గురు చిన్నారులను కాపాడే ప్రయత్నంలో వారి మామయ్య సైతం మునిగిపోయాడు. ఈ సంఘటన కడప జిల్లా సిద్ధవటంలో గురువారం సాయంత్రం జరిగింది. మృతులను కర్నాటక రాష్ట్రం రాయచూరుకు చెందిన జోహా(12), మదిహా(9), ఫరిహా(9), సిద్ధవటానికి చెందిన అన్వర్‌బాషా(40)గా గుర్తించారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాయచూరుకు చెందిన ముంతాజ్ బేగం తన నలుగురు పిల్లలతో కలిసి సిద్ధవటంలో ఉంటున్న సోదరుల వద్దకు వచ్చింది. అంతా కలిసి గురువారం సాయంత్రం సమీపంలోని పెన్నానది వద్దకు విహారానికి వెళ్లారు. ఈ క్రమంలో ముంతాజ్‌బేగం పిల్లలు జోహా, మదిహా, ఫరిహా మరికొంత మంది నీళ్లలో ఆడుకుంటూ లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లారు. ఆడుకుంటూ ఆడుకుంటూ ముగ్గురు నీట మునిగారు. ఇది గమనించిన వారి మామ అన్వర్‌బాషా రక్షించేందుకు వెళ్లి అతడు సైతం మునిగిపోయాడు. ఈత రాకపోవడంతో అంతా నీట మునిగారు. ఒడ్డున ఉన్నవారు ఇది గమనించి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వారిని రక్షించి బయటకు తీసుకువచ్చా రు. అప్పటికే నలుగురు ప్రాణాలు విడిచారు. దీంతో వారి ఇంట విషాదం నెలకొంది.