క్రైమ్/లీగల్

రెండు కిలోల బంగారం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 24: ట్రైన్‌లో బంగారం రవాణా చేస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి దాదాపు రూ.62.35 లక్షల విలువైన రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన విశాఖ రైల్వే స్టేషన్‌లో ఆదివారం వెలుగుచూసింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ వర్గాలకు అందిన అత్యంత విశ్వసనీయమైన సమాచారం మేరకు గౌహతి నుంచి చెన్నై వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణీకులను తనిఖీ చేయగా, బంగారం స్మగ్లింగ్ వెలుగుచూసింది. ఒక వ్యక్తి గిటార్‌లో 1992 గ్రాముల బంగారాన్ని బిస్కెట్ల రూపంలో దాచి ఉంచడాన్ని గుర్తించారు.
ఈ వ్యక్తి నుంచి బంగారం స్వాధీనం చేసుకుని ప్రశ్నించారు. మయన్మార్ దేశం నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్టు గుర్తించారు. వ్యక్తిని అదుపులోకి తీసుకుని, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు డీఆర్‌ఐ వర్గాలు తెలిపాయి.