క్రైమ్/లీగల్

స్పీకర్ కోడెలకు హైకోర్టులో ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు కరీంనగర్ ట్రయల్ కోర్టు ఇచ్చిన సమన్లను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 18న ట్రయల్‌కోర్టు ముందు హాజరుకావాలని కోడెలకు సమన్ల జారీ అయ్యాయి. 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు రూ 11,33 కోట్లు ఖర్చు చేశానని ఆయన ఒక టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పారు. ఈ విషయాలను క్రోడికరిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కరీంనగర్ సీనియర్ నేత భాస్కర్‌రెడ్డి కరీంనగర్ ట్రయల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమావాళిని దిక్కరించి కోడెల శివప్రసాద్ ఎన్నికల్లో ఖరు చేయడంపై భాస్కర్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు.