క్రైమ్/లీగల్

ప్రేమించలేదని చంపేశాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్: కరీంనగర్‌లో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమ నిరాకరించిందనే కోపంతో ఉన్మాదిలా మారిన యువకుడు కత్తితో యువతి గొంతు కోసి హత్యాయత్నం చేశాడు. రక్తపు మడుగులో పడివున్న యువతిని ఆస్పత్రికి తరలించేలోపే మరణించింది. కలెక్టరేట్ ఎదుట మీ-సేవ కేంద్రంలో జరిగిన ఈ హఠాత్ సంఘటన పరిసరాల్లోని వారిని భయభ్రాంతులకు గురిచేసింది. వివిధ పనుల నిమిత్తం అక్కడకు వచ్చిన వారంతా భీతిల్లిపోయారు. గొంతుకోసి కసాయ పారిపోతుండగా స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం మండలం హన్‌మాన్‌నగర్ ప్రాంతానికి చెందిన ఊట్ల రోషిణి అలియాస్ రసజ్ఞ (22) కలెక్టరేట్ సమీపంలోని మీ-సేవా కేంద్రంలో మూడు మాసాలుగా ఆపరేటర్‌గా పనిచేస్తోంది. శుక్రవారం ఉదయం విధులకు హాజరైన తరుణంలో పహాణీలు కావాలంటూ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని శంకరపల్లి గ్రామానికి చెందిన వంశీధర్ మీ-సేవా కేంద్రానికి వచ్చాడు. రసజ్ఞతో కొద్దిసేపు మాట్లాడిన అనంతరం వాగ్వాదా నికి దిగాడు. అతన్ని పంపించేందుకు బయటకు వచ్చిన రసజ్ఞపై తనవెంట తెచ్చుకున్న కత్తితో మెడపై దాడి చేశాడు. అనూహ్య ఘటనతో తీవ్రంగా గాయపడిన ఆమె, రక్తపుమడుగులో కొట్టుకుంటుండగా అక్కడున్న వారు ఆస్పత్రికి తరలించారు. యువతి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు కొద్ది మాసాల క్రితమే నగరానికి వచ్చి, భగత్‌నగర్‌లోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ మీ-సేవా కేంద్రంలో పనిచేస్తున్నట్లు తెల్సింది. కసాయని అదుపులోకి తీసుకున్న పోలీసులు
విచారణ నిమిత్తం రహస్య ప్రాంతానికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. యువతి హత్యకు గురైన విషయం దావానంలా వ్యాపించడంతో కలెక్టరేట్ పరిసరాలకు వందల సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. కూతురి హత్య విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సివిల్ ఆస్పత్రికి చేరుకుని విలపిస్తున్న తీరు అందరినీ కలిచి వేసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా, ప్రేమ వివాదమే యువతిపై దాడికి దారితీసినట్లు వంశీధర్ పేర్కొంటుండటం గమనార్హం.

చిత్రాలు..హత్యకు గురైన యువతి రసజ్ఞ.. *నిందితుడు వంశీధర్