క్రైమ్/లీగల్

కంటైనర్ దగ్ధం: డ్రైవరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, జూన్ 18: దేవరపల్లి మండలం యర్నగూడెం శివారు సూర్యనారాయణపురం వద్ద ఆదివారం అర్ధరాత్రి విద్యుదాఘాతంతో కంటైనర్ దగ్ధమైన సంఘటనలో డ్రైవరు జితేందర్ (24) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరం వైపు నుండి ఏలూరు వెడుతున్న కంటైనర్ సూర్యనారాయణపురం వద్దకు వచ్చే సరికి విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. దాంతో డ్రైవర్ జితేందర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని స్థానికులు 108 వాహనంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్టు ఎఎస్సై రామకృష్ణ తెలిపాడు. మృతుడు హరియాణా రాష్ట్రానికి చెందిన వాడుగా ఆయన చెప్పారు.
రైలు నుంచి జారి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు
ఏలూరు, జూన్ 18 : స్థానిక రైల్వేస్టేషన్ వద్ద విశాఖపట్నం వెళుతున్న ఒక రైలునుంచి ఒక వ్యక్తి జారపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. గన్నవారం మండలం మర్లపాలెం గ్రామానికి చెందిన మేడిపూడి శివరామకృష్ణ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నం వెళ్లేందుకు ఇంటి వద్ద నుంచి బయలుదేరాడు. కాగా సోమవారం పెద్ద రైల్వేస్టేషన్ వద్ద ఒక రైలు నుంచి జారిపడి గాయపడ్డాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం రైల్వేపోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా వుండటంతో విజయవాడ ఆసుపత్రికి తరలించారు.