క్రైమ్/లీగల్

ఆస్తి వివాదంతో అన్నను హతమార్చిన తమ్ముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొల్లాపల్లి, జూన్ 23: ఆస్తి వివాదం నేపథ్యంలో అన్నను తమ్ముడు హతామార్చాడు. ఈ సంఘటన బొల్లాపల్లి మండలంలోని గరికపాడు గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దొంతు వెంకటయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరికి ఉన్న ఉమ్మడి ఇంటి స్థలం తండ్రితో పాటు అన్నదమ్ములు ఇద్దరూ పెద గోపాల్ (38), తమ్ముడు పున్నారావులు కొంత కాలం కిందట పంచుకున్నారు. ఈ స్థలం విషయంలో తమ్ముడు పున్నారావు తనకు ఒక సెంటు వస్తుందని తరచుగా అన్నతో ఘర్షణ పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి స్థల వివాదం నెలకొన్నది. కోపోద్రిక్తుడైన తమ్ముడు పున్నారావు మద్యం మత్తులోనే గొడ్డలితో అన్నపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయ పడిన గోపాల్ రక్తపు మడుగులోనే ప్రాణాలు కోల్పోయాడు. వినుకొండ రూరల్ సిఐ బి కోటేశ్వరరావు,బండ్లమోటు ఎస్‌ఐ ఎంవి చరణ్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.