క్రైమ్/లీగల్

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాపూర్, ఫిబ్రవరి 18: మండలంలోని గుజ్జులపల్లి గ్రామానికి చెందిన జంపాల రమేష్ (40) అనే కౌలు రైతు పురుగుల మందు తాగి ఆదివారం మృతి చెందాడు. సైదాపూర్ ఎస్‌ఐ నూతి శ్రీ్ధర్ తెలిపిన ప్రకారం.. గ్రామంలో రెండెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ సందర్భంగా పంట దిగుబడి రాక నాలుగు లక్షల రూపాయల వరకు అప్పులు కావడంతో శనివారం ఇంటి వద్ద ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగగా గుర్తించిన స్థానికులు అపస్మారక స్థితిలో ఉన్న రమేష్‌ను హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజిఎంకు పంపించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి భార్య జంపాల సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీ్ధర్ తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.