క్రైమ్/లీగల్

కారును ఢీకొన్న లారీ: ముగ్గురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపవరం, జూలై 1 : కారును లారీ ఢీకొనడంతో ముగ్గురు అనంతపురం జిల్లా వాసులు మృతి చెందిన సంఘటన ఆదివారం కడప జిల్లా గోపవరం మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. అనంతపురం నగరంలోని మంగళకాలనీకి చెందిన వెంకటరామిరెడ్డి(60), సుజాత(50) దంపతులు నెల్లూరులోని తమ బంధువుల ఇంట జరిగే వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కారులో బయల్దేరారు.
అయితే వీరు గోపవరం మండల పరిధిలోని 67వ జాతీయ రహదారిపై వెళ్తుండగా తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో మడకలవారిపల్లె సుదర్శన ఆశ్రమం వద్ద లారీ వేగంగా వచ్చి కారును ఢీకొంది. ఈ సంఘటనలో వెంకటరామిరెడ్డి, సుజాత దంపతులతో పాటు కారు డ్రైవర్ వేణుగోపాల్(25) అక్కడికక్కడే మృతి చెందారు.
విషయం తెలిసిన వెంటనే గోపవరం రూరల్ ఎస్‌ఐ హేమాద్రి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.