క్రైమ్/లీగల్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జూలై 1: యాదాద్రి భువన గిరి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామానికి చెందిన రైతు ముద్దం రవందర్ (35) అప్పుల బాధలు తట్టుకోలేక ఆదివారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఏడాది అప్పులు చేసి తన మూడెకరాల వ్యవసాయ భూమి లో పత్తి పంటను సాగు చేసాడు. సరైన దిగుబడి రాకపోవడంతో అప్పులే మిగిలాయి. పాత అప్పులకు పెట్టుబడి అప్పులు తోడవ్వడంతో తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి ముద్దం బాలయ్య వచ్చి చూసే సరికి వేలాడుతూ కన్పించాడు. ఇరుగుపొరుగు వాళ్ళు రాగా అప్పటికే రవీందర్ మృతి చెందాడు. బాలయ్య స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. సీఐ వెంకటయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నా రు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

చిత్రం..రవీందర్ మృతదేహాం