క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూసుమంచి, జూలై 2: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన కూసుమంచి మండలం గంగబండతండాలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే కూసుమంచి నుండి కొండపల్లి వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం గంగబండ తండా వద్ద రాజేశ్వరపురం నుండి కూసుమంచి వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న గుంటి నాగేశ్వరరావు(52), అతని భార్య అనుసూయమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా వారిని తురకగూడెం వాసులుగా గుర్తించి, ఇరువురిని 108ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తలకు తీవ్ర గాయలవడంతో ఆసుపత్రిలో చెరిన కాసేపటికే గుంటి నాగేశ్వరరావు మృతి చెందాడు. ఎన్డీ మండల నాయకులు మృత దేహానికి నివాళులర్పించారు. మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ పూదరి రఘు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.