క్రైమ్/లీగల్

రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోనకల్, జూలై 2: మండల కేంద్రంలోని బోనకల్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని చిరునోముల గ్రామానికి చెందిన కర్లపూడి కిషోర్ (16) 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుకొని తల్లిదండ్రులు మందలించగా ఇంటి నుండి బయటకు వెళ్ళి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో 10వ తరగతి చదువుకునే సమయంలో కూడా తల్లిదండ్రులు రమేష్, రమాదేవిలు పాఠశాలకు సరిగా వెళ్లడం లేదని కిషోర్‌ను మందలించగా ఇంటి నుండి పారిపోయాడు. అప్పట్లో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు విద్యార్థిని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. కిషోర్ మృతిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.